గత మూడు రోజుల నుంచి హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆఫీసులకు వెళ్లే వారు.. తిరిగి వచ్చే వారు రోడ్ల పై పారుతున్న వరద నీటి ప్రవాహంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ట్రాఫిక్ డైవర్ట్ చేసే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే.. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. వర్షపు నీరు ఎగువ నుంచి అధికంగా వస్తుండటంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నీరు నిలిచిపోయింది. దీంతో ఆ ఏరియాలో వాహన రాకపోకలను నిలిపివేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.