హైదరాబాద్ వాహనదారులకు ముఖ్య గమనిక! నగరంలోని పలుప్రాంతాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. జులై 13 నుంచి 15 వరకు మహంకాళి బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ ఏరియాలో ఈ ఆంక్షలు విధిస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. మీ ప్రయాణాలను ప్లాన్ చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బోనం సమర్పించనున్నారు. మరి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండే ప్రాంతాలేవంటే..