తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసే 'పాయింట్ల' విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. మద్యం సేవించి నడపడం, అతివేగం వంటి ఉల్లంఘనలకు 12 పాయింట్లు వస్తే లైసెన్స్ ఏడాది పాటు రద్దు అవుతుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.