రహదారి ప్రమాదాలు.. మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఇదొకటి.. నిత్యం మనముందే ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. మనలో చాలా మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. రూల్స్ మీద అవగాహన ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితం అమాయకుడి ప్రాణాలు బలి.. ఒక్కొక్కసారి మనం రూల్స్ ఫాలో అయినప్పటికీ.. ఎదుటోడి నిర్లక్ష్యం మన కొంప ముంచుతోంది. అయితే రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ హెల్మెట్ ధరించకపోవటం వలనే జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరిస్తేనే జిల్లాలో ఎంట్రీకి అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.