వాహనదారులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ 24 గంటల్లోనే పూర్తి అయ్యేలా నూతన విధానం తీసుకువచ్చింది. షోరూం డీలర్ వద్ద టెంపరరీ రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు రవాణా శాఖ అధికారులకు చేరుతుంది. అధికారులు 24 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ అధికారులు పూర్తి చేయలేకపోయినా ఆటోమేటిక్గా ఆమోదం తెలిపేలా సాఫ్ట్ వేర్ రూపొందించారు.