సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. హైదరాబాద్ నగరంలో శాంతి పరిరక్షణలకు అధిక ప్రాధన్యత ఇస్తాను అని తెలిపారు. ఈక్రమంలో వాహనదారులకు ఆయన పలు సూచనలు చేస్తున్నారు. తాగి వాహనం నడవద్దని కోరిన సజ్జనార్.. తాజాగా వాహనదారులకు మరో అంశంలో వార్నింగ్ ఇచ్చారు. నగరంలో చాలా మంది వాహనదారులు.. మరీ ముఖ్యంగా క్యాబ్, ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్ సెట్, ఇయర్ ఫోన్స్ వంటివి వాడుతున్నారని.. ఇకపై ఇలాంటి వారిని చూస్తూ ఊరుకునేది లేదని తెలిపారు. వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.