వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం చోటుచేసుకుంది. వేపూరి యాదయ్య తన భార్య, ఇద్దరు పిల్లలు, వదినను కత్తితో అతి కిరాతకంగా హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో యాదయ్య చిన్న కూతురు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు హత్యలకు కారణాలు అయి ఉండొచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.