తెలంగాణలోని పాడి రైతులకు శుభవార్త చెప్పేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాగు రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోన్న సర్కార్.. ఇప్పుడు పాడి రైతులను కూడా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. విజయ డెయిరీ పాల ధరలను సవరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు పాల ధరలను పెచించి ప్రభుత్వం.. మరోసారి లీటరుకు రూ.3 వరకు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం.