ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిని కొంతమంది ఆగంతకులు బెదిరించిన ఘటన.. విజయవాడలోని పటమట ప్రాంతంలో చోటుచేసుకుంది. యారంవారి వీధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బాలుడు ఒక్కడే ఉన్న సమయంలో నలుగురు దుండుగులు ఇంట్లోకి ప్రవేశించారు. బాలుడి మెడపై కత్తిని ఉంచి అతని తండ్రి ఫోన్ నంబర్ చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఈలోపే చుట్టుపక్కలవారు గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.