Guinness Record For Vijayawada Dasara Carnival: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో దసరా ఉత్సవాలను మైసూర్ దసరాకు దీటుగా నిర్వహించి, మొదటి ఏడాదే గిన్నిస్ రికార్డు సాధించింది. భారీ డప్పు ర్యాలీతో ఈ రికార్డు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై, వేలమంది కళాకారులతో జరిగిన కార్నివాల్ను ప్రారంభించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడ నిర్వహించిన ఈ ఉత్సవాలు విజయవాడలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.