NTR District Lovers Steals Together: విజయవాడలో ఓ ప్రేమజంట చోరీ వ్యవహారం సంచలనం సృష్టించింది. పటమటలో ఓ ఇంట్లో 280 గ్రాముల బంగారం, రూ.25 వేలు నగదును దొంగిలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు. అంతకుముందు ఆ జంట ఓ ఇంటి గేటుకు కట్టిన కుక్కపిల్లను కూడా ఎత్తుకెళ్లినట్లు తేలింది. నిందితుల్లో ఒకరిని భవానీపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న ప్రేమికుల కోసం గాలిస్తున్నారు.