విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్! దుర్గ గుడి ఘాట్ రోడ్డును మరమ్మత్తుల కారణంగా మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. మే 6, 7, 8 తేదీల్లో ఈ మార్గం అందుబాటులో ఉండదు. అమ్మవారి దర్శనానికి కనకదుర్గ నగర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని దుర్గ గుడి దేవస్థానం అధికారులు తెలిపారు.