ఉగ్రవాదులతో సంబంధం ఉందని అనుమానిస్తున్న ముగ్గురు యువకులకు విజయవాడ సీసీఎం కోర్టు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 6వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నాయంటూ ముగ్గురు యువకులను విజయవాడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి ఉగ్రవాద భావజాలాన్ని యువతలో ప్రోత్సహించేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.