Vijayawada Temple Darshan Rules: విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రముఖుల రద్దీ నియంత్రణకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. చంద్రబాబు నాయుడు మూలా నక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.