Vijayawada Durga Temple Dasara Huge Income: దసరా పండుగ సమయంలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటూ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. దసరా సందర్భంగా అమ్మవారి హుండీకి ఆదాయం కూడా భారీగా పెరిగింది. 15 రోజుల్లో ఏకంగా రూ.3.5 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విజయవాడ దుర్గమ్మ ఆలయానికి ఒకరోజు ఏకంగా రూ.85 లక్షల ఆదాయం రావడం విశషం.