Vijayawada Durgamma Devotee Donates Gold Necklace: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు విద్యాధరపురానికి చెందిన భక్తుడు శ్రీనివాసరావు రూ.12 లక్షల విలువైన బంగారు హారాన్ని సమర్పించారు. భక్తులకు దుర్గమ్మ సేవ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాజగోపుర ప్రాంగణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈవో శీనానాయక్ తెలిపారు. అంతేకాకుండా, ఆలయ పరిపాలన సక్రమంగా జరిగేందుకు ఏఈవోలు, సూపరింటెండెంట్ల బదిలీలు జరిగాయి. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారో కూడా తెలియజేశారు.