Vijayawada Secunderabad Railway Line Electric Traction Work: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజధానుల మధ్య రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థ పనులకు రూ.188.31 కోట్లతో ఆమోదం తెలిపింది. ఈ పనులు మూడేళ్లలో పూర్తయితే ప్రయాణికుల, సరుకు రవాణా రైళ్ల రాకపోకలు మెరుగుపడతాయి. మరోవైపు, మొంథా తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు, పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.