విజయవాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూలులో మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి జరిగినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూలు టీచర్ యాసిడ్ పోశారని.. ఆ తర్వాత బాత్రూమ్లో కిందపడిపోయినట్లు ఫోన్ చేశారని చెప్తున్నారు. ఈ ఘటనలో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్కు గాయాలైనట్లు తెలిసింది. మరోవైపు ఘటనకు కారణమైనవారిపైనా, స్కూలు యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.