Vijayawada metro Update News: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కీలక అప్ డేట్ వచ్చింది. విజయవాడ మెట్రో తొలి దశ నిర్మాణానికి భూసేకరణ చేపట్టనున్నారు. వారం రోజుల్లోగా భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిసింది. తొలి దశ నిర్మాణం కోసం 82 ఎకరాల వరకూ భూమి అవసరమని అంచనా. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూమి పోనూ 77 ఎకరాల వరకూ ప్రైవేట్ భూమి ఉంది. ఆ భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.