విజయవాడలో ఓ జంట చేసిన పని అందరినీ విస్తుపోయేలా చేసింది. ఫ్లై ఓవర్ పై బైక్ నడుపుతూనే అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఉన్న ఆ జంట రోడ్డుపై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. వారి వికృత చేష్టలను చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. నెటిజన్లు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి కోసం గాలిస్తున్నారు.