YS Sharmila Letter To chandrababu over Vijayawada West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరారు. విజయవాడ ప్రజలు, అణగారిన వర్గాలకు వంగవీటి రంగా చేసిన సేవలకు గుర్తుగా విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారికి ఆయన పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని వైఎస్ షర్మిల లేఖ రాశారు. విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారి నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రోడ్డుకు వంగవీటి రంగా పేరు పెట్టాలని షర్మిల కోరారు.