బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం రోజు సీఎం చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.