Vijayawada Water Aerodrome Rs 20 Crores: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర రూ.20 కోట్లతో వాటర్ ఏరో డ్రోమ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన అధికారులు ప్రకాశం బ్యారేజీని పరిశీలన కూడా చేశారు.