Rain in Vijayawada: రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విభిన్నంగా ఉంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు భారీ వర్షం కురుస్తోంది. ఇక ఆదివారం నాడు విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. మొగల్రాజపురం, పటమట, చిట్టినగర్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది అని చెప్పవచ్చు.