Vijayawada Swachh Ratham Free Groceries: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ గ్రామాల్ని శుభ్రంగా ఉంచేందుకు 'స్వచ్ఛ రథం' అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి పనికిరాని వస్తువులు తీసుకుని, వాటి విలువకు తగ్గట్టు సరుకులు ఇస్తారు. గుంటూరులో ఇదివరకే మొదలైంది, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఆగష్టు 1 నుంచి మొదలుకానుంది. రామవరప్పాడులో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ రథం ఊరంతా తిరిగి చెత్త సేకరించి, ప్రజలకు ఉపయోగపడే వస్తువులు అందిస్తుంది.