Vijayawada Hotels Till Midnight: విజయవాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. నగరంలో హోటల్స్, రెస్టారెంట్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇకపై నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడ సీపీకి హోటల్స్ యాజమాన్యాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రిక్వెస్ట్ చేసిన హోటళ్ల యజామాన్యాలు. వెంటనే సానుకూలంగా స్పందించి కలెక్టర్, సీపీ ప్రత్యేక సమావేశం.. ఆదివారం నుంచి అమల్లోకి రూల్.