చర్లపల్లిలో సూసైడ్ చేసుకున్న విజయశాంతి రెడ్డి ఫ్యామిలీ సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవటానికి గల కారణాలు వెల్లడించారు. డిప్రెషన్ కారణంగానే వాళ్లు ట్రైన్ పట్టాలపై సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకున్న విజయశాంతి రెడ్డి వారు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరింపించిందని అన్నారు.