ఉచితంగా విద్యాబోధన.. యూనిఫామ్, భోజనం.. వసతి కూడా.. అలాగని అదేమీ ప్రభుత్వ పాఠశాల కాదు.. ప్రైవేట్ విద్యాసంస్థ. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న నైస్ విద్యాసంస్థ అనాథ పిల్లలకు ఉచితంగా విద్యాబోధన అందిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఎంతోమంది అనాథ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. నైస్ విద్యాసంస్థలో విద్యాబోధనతో పాటుగా ఉచితంగా హాస్టల్ వసతి కూడా ఉంది. 2025-26 విద్యా సంవత్సరం కోసం ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.