Siddipet Dommata Government School Teachers: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దొమ్మాట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. 36 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండగా.. వారిలో ఒకరు డిప్యూటేషన్పై వెళ్లడంతో ఇద్దరితోనే బోధన కొనసాగుతోంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.