విద్యార్థులకు టీటీడీ శుభవార్త వినిపించింది. టీటీడీ విద్యాసంస్థలలో విద్యార్థులకు ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చదివేందుకు అలాగే శిల్ప కళలో కోర్సు చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. కాలేజీల ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. మరోవైపు టీటీడీకి దేశవ్యాప్తంగా 33 విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.