ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థి సంఘాల దాడులు, చందాల వసూళ్లకు నిరసనగా ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు బంద్కు పిలుపునిచ్చాయి. బుధవారం పీడీఎస్యూ నాయకులు స్కూల్ కరస్పాండెంట్పై దాడి చేయడంతో ఈ బంద్ ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేసి, విద్యార్థి సంఘాల వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.