Telangana University postponed exams due to rain: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మరోసారి ఉగ్రరూపం దాల్చుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలా ఈ వరదల కారణంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఆగస్టు 28న జరగాల్సిన పీజీ, బీఎడ్, ఎమ్మేడ్ పరీక్షలను వాయిదా వేసింది. విద్యార్థుల రవాణా సమస్యల దృష్ట్యా యూనివర్సిటీ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.