విద్యార్థులకు అలర్ట్.. .. రేపటి నుంచి ‘కాలేజీల బంద్’ లేనట్లే..

4 months ago 15
తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చల అనంతరం బంద్‌ విరమిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ప్రభుత్వం తక్షణమే రూ.600 కోట్లు.. త్వరలో మరో రూ.300 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. గతంలోనూ రూ.300 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి బంద్‌లో ఉన్న రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కళాశాలలు చర్చలు ఫలవంతంగా ముగియడంతో తిరిగి యథావిధిగా ప్రారంభం కానున్నాయి.
Read Entire Article