విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాస్టల్స్‌లో ఇక ఆ సమస్య తప్పినట్లే..

3 months ago 8
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల వసతి గృహాలు, స్టడీ సర్కిల్స్‌లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసింది. 311 సంక్షేమ హాస్టల్స్‌లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం కోసం రూ.6.22 కోట్లు, 49 గురుకుల వసతి గృహాలు, 2 స్టడీ సర్కిల్స్‌లో ఆర్వో ప్లాంట్ల కోసం రూ.3.06 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.
Read Entire Article