TG Fish Curry In Mid Day Meal: తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. త్వరలోనే రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డించేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు తెలంగాణ మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మధ్యాహ్న భోజనంలో చేపలు పెడతామని.. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 26 వేల నీటి వనరుల్లో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. ఆ వివరాలు..