School Holidays: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులను పొడిగించే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా కోల్పోయిన తరగతులను పూడ్చడానికి రెండో శనివారం కూడా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 21 నుంచి 28 వరకు సెలవులు రానుండగా, ఇతర విద్యా సంస్థలకు డిసెంబర్ 25 నుంచి 28 వరకు నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై విద్యాశాఖ త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది.