తెలంగాణలో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. గత రికార్డులను అన్నీ తిరగరాస్తూ.. అత్యధికంగా విద్యుత్ వినియోగం నమోదు అవుతోంది. అటు వ్యవసాయానికి తోడు పరిశ్రమలు, గృహ అవసరాలు పెరగడంతో డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్లు కరెంట్ సరఫరా చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూస్తున్న సిబ్బందికి భట్టి విక్రమార్క అభినందనలు తెలియజేశారు.