గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యుత్ సంస్కరణలు మొదట తానే చేశానని ఆయన అన్నారు. గ్రీన్ హైడ్రోజన్పై పరిశోధనలు చేయాలని ఎనర్జీ కంపెనీలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు ఎక్కువగా ఉన్నాయని.. హైడ్రోజన్ వ్యాలీగా మారుతుందన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయాలనీ ఆయన ఆకాంక్షించారు. 2047 నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ తయారీ లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు.