ఏపీలోని ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పని చేస్తున్న ఉద్యోగులందరూ విధులు బహిష్కరిస్తున్నట్లు ఏపీ వైద్య సేవ ఎంప్లాయిస్ యూనియన్ కేడర్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ గోవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. వరుసగా మూడు సోమవారాలు తాము విధులకు హాజరుకామని తెలిపారు. NTR వైద్యసేవా ట్రస్ట్ పరిధిలో పనిచేసే ఫీల్డ్ సిబ్బంది, వైద్యమిత్ర, టీం లీడర్స్, తదితర సిబ్బంది విధులు బహిష్కరించనున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.