ప్రజల కోసం తపాలా శాఖ కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఒకప్పుడు రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు వంటివి పంపాలంటే పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉండేది. కానీ తపాలా శాఖ ఈ సేవలను మరింత సులభతరం చేసింది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు పంపే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. ఇంటి వద్ద నుంచే బుకింగ్ చేసుకుంటే తపాలా శాఖ సిబ్బంది వీటిని కలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత చేరవేయాల్సిన అడ్రస్కు చేరవేస్తారు. అలాగే మరింత మెరుగైన సేవలు అందించేందుకు తపాలా శాఖ డాక్ పే, పోస్ట్ ఇన్ఫో యాప్ వంటి సేవలను కూడా తీసుకువస్తోంది.