Tirupati 1993 Plane Crash: గుజరాత్లో విమాన ప్రమాదం నేపథ్యంలో 1993లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విమాన ప్రమాదం గుర్తుకు వస్తోంది. తిరుపతి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని పైలట్లు చాకచక్యంగా పొలంలో ల్యాండ్ చేశారు. ఈ విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి టాలీవుడ్ ప్రముఖులు 60 మందికి పైగా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటికీ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి సర్పంచ్ దేశిరెడ్డి ఈ ప్రమాదం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.