ఆంధ్రప్రదేశ్లో వరుస దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ సంజయ్ రాయ్ను ఎట్టకేలకు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగ దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. విమానంలో వచ్చి దొంగతనాలు చేసి.. ఎవరికీ తెలియకుండా అస్సాంకు వెళ్లిపోయేవాడని వెల్లడించారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా.. సంజయ్ ఆచూకీ తెలిసింది. అనంతరం అతడిపై నిఘా పెట్టి మరో దొంగతనం చేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు.