హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై అడ్వకేట్ నాగూర్ బాబు పిల్ దాఖలు చేయగా, కోర్టు విచారణ జరిపి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.