తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కొండా సురేఖ వివాదానికి తాజాగా ఎండ్ కార్డ్ పడింది. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు సహజమని, అందరం కలిసి ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ కుటుంబంలో తమ మధ్య వచ్చిన మనస్పర్థలు కూడా టీ కప్పులో తుపాన్లాంటివని సురేఖ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..