6 Crore Cyber Fraud in Visakhapatnam: విశాఖపట్నంలో మరో సైబర్ మోసం వెలుగుచూసింది. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో మధురవాడకు చెందిన ఓ 55 ఏళ్ల వ్యక్తిని కొంతమంది రూ.6 కోట్ల మేరకు మోసం చేశారు. సోషల్ మీడియా మాధ్యమాలు అయిన ఫేస్ బుక్. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మహిళ.. పెట్టుబడులు, లాభాలు పేరు చెప్పి మనోడిని నమ్మించింది. వివిధ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపించేలా చేసింది. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.