ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పలు పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. టీసీఎస్, లులూ వంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టనున్నాయి. నగరం విస్తరిస్తూ ఉండటంతో పాటుగా జనాభా కూడా పెరుగుతోంది. అయితే శివారు ప్రాంతాల్లో ఉండటానికి బదులుగా విశాఖవాసులు నగరం మధ్యలో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో విశాఖలో భారీ భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటి వరకూ విశాఖలో అత్యంత ఎత్తైన భవనం ఏదంటే సీతమ్మధార బిల్డింగ్ ఉండేది. ఇప్పుడు ఆ బిల్డింగ్ రికార్డులు బ్రేక్ చేసేలా బిల్డింగ్ల నిర్మాణం జరుగుతోంది.