విశాఖ: పండగ పూట ఘోరం.. కుటుంబంలో విషాదం నింపిన అలలు..

2 months ago 12
విశాఖపట్నంలో పండగ పూట విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా రుషికొండ బీచ్‌కు వచ్చిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితులతో కలిసి రుషికొండ బీచ్‌కు వచ్చిన అరవింద్ కృష్ణ అనే బీటెక్ ఫైనలియర్ విద్యార్థి.. అలల ధాటికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. లైఫ్ గార్డులు అతన్ని ఒడ్డుకు చేర్చే సరికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతుడి స్వస్థలం రాజమండ్రిగా తెలిసింది.
Read Entire Article