విశాఖలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా పాకిస్థాన్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తూ, సుమారు రూ. 200 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. లోన్ యాప్ వేధింపుల కారణంగా నరేంద్ర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నరేంద్ర కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, సిమ్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.