విశాఖపట్నంలో పార్కులలో నడకపై వాకింగ్ ట్యాక్స్ విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం దీనిపై క్లారిటీ ఇచ్చింది. విశాఖలో వాకింగ్ ట్యాక్స్ అనేది పూర్తిగా అవాస్తవమన్న ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం.. శివాజీ పార్కు, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని.. కొంతమంది కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.