Visakhapatnam Cii Partnership Summit 2025 Food Menu: విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో అతిథులకు ఆంధ్రా రుచులతో భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్చమైన ఆంధ్రా రుచులు విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి. మొత్తం 3 వేల మందికి 20 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేయగా, ముఖ్యంగా సాంప్రదాయ స్వీట్లైన అరిసెలు, పూతరేకులు, కాజా వంటివి విదేశీయులను అమితంగా ఆకట్టుకున్నాయి. చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు ఈ విందును ఆస్వాదించారు.